బుల్లితెర ఫై స్టార్ యాంకర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు. రేడీయో జాకీగా అందరికి సుపరిచితమైన ప్రదీప్.. ఆ తర్వాత జీ తెలుగు ఛానెల్‌లో యాంకర్‌గా అవకాశాన్ని అందుకున్నాడు. ఆరంభంలో పలు షోలు చేసిన అతడు గడసరి అత్త సొగసరి కోడలు అనే గేమ్‌ షోతో మంచి గుర్తింపుతో పాటు భారీ స్థాయిలో క్రేజ్ కూడా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు షోలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. ప్రదీప్ తన గొప్ప మనసుని చాటి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.

జీ తెలుగులో ప్రసారం అవుతున్న సరిగమప పాటల పోటీ సెమీ ఫైనల్‌కి చేరుకుంది. ఈ సీజన్‌లో ఎంతోమంది యువ గాయనీ గాయకులు తమ టాలెంట్ ను బయటకు తీసుకొచ్చారు. వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. అలవైకుంఠపురములో చిత్రంలోని సామజవరగమన సాంగ్‌తో సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నాడు. ఇతడికి సంబంధించి ఓ ఎమోషనల్ ప్రోమో విడుదల చేసింది జీ తెలుగు. పవన్ కళ్యాణ్ సరిగమప స్టేజ్ మీద నిలబడటానికి కారణమైన అతని తండ్రి, గురువులను స్టేజ్ మీదికి తీసుకువచ్చాడు యాంకర్ ప్రదీప్. ఆలా స్టేజ్ మీదకు వచ్చిన పవన్ కళ్యాణ్ తన తండ్రి కష్టాన్ని, గురువు గొప్పతనాన్ని చెప్పి అందరి చేత కంటతడి పెట్టించాడు. పవన్ మాటలు విని చలించిపోయిన ప్రదీప్.. పవన్ కళ్యాణ్ తండ్రి గురువులకు చేతులెత్తి నమస్కరిస్తూ.. మీ వల్ల మాకు అద్భుతమైన సింగర్ దొరికాడు. మీకు ఇంకో అబ్బాయి ఉన్నాడని అనుకుందాం.. నేను మీ పెద్దకొడుకు అనుకోండి.. ఒక అన్నగా.. పవన్ కళ్యాణ్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేటంత వరకూ కాలేజ్ ఫీజు మొత్తం నేను కట్టి చదివిస్తా అని సరిగమప స్టేజ్‌పై హామీ ఇచ్చి కోట్లాది మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.

ప్రదీప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కోట్లాది మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబదించిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఇక ప్రదీప్ సినిమా విషయానికి వస్తే.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీతో వెండితెర కు హీరో గా పరిచయం అవుతున్నాడు. అమృత అయ్యార్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మున్నా కొత్త దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం రిలీజ్ చేయబోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: