అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి తనదైన శైలిలో సినిమాల్లో నటిస్తూ అలరిస్తూ వస్తుంది. అయితే సినిమాలైతే చేస్తుంది కాని అమ్మడికి సరైన క్రేజ్ రాలేదని చెప్పాలి. ఇప్పటికి యువ హీరోలతోనే అమ్మడు సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మధ్యలో నాగార్జున లాంటి సీనియర్ స్టార్ తో నటించినా ఆ సినిమా ఆమెకు మైనస్ అయ్యింది తప్ప ప్లస్ మాత్రం కాలేదు. ఇక లేటెస్ట్ గా యువ హీరోలు కార్తికేయ, సందీప్ కిషన్ ల సినిమాలతో వస్తుంది లావణ్య త్రిపాఠి.

కార్తికేయతో చావు కబురు చల్లగా సినిమా చేస్తున్న లావణ్య త్రిపాఠి.. ఆ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా సందీప్ కిషన్ హీరోగా వస్తున్న ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో కూడా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. ఏ1 ఎక్స్ ప్రెస్ లో లావణ్య మునుపటి సినిమాల కన్నా కొద్దిగా గ్లామర్ డోస్ పెంచిందని చెప్పాలి. రీసెంట్ గా సినిమా ట్రైలర్ రిలీజ్ అవగా అందులో లావణ్య రెచ్చిపోయినట్టు తెలుస్తుంది.

మడి కట్టుకు కూర్చుంటే అవకాశాలు రావడం కష్టమని భావించింది కాబోలు అందుకే అమ్మడు ఇక రెచ్చిపోవాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. ఏ1 ఎక్స్ ప్రెస్ చూసి లావణ్య త్రిపాఠి అందాలతో ఆడియెన్స్ షాక్ అవడం పక్కా అని అంటున్నారు. అమ్మడి అసలు అందాలను ఈ సినిమాతో బయట పెడుతుందని తెలుస్తుంది. అంతేకాదు సందీప్ కిషన్ తో లిప్ లాక్ కూడా కానిచ్చిందని తెలుస్తుంది. మరి ఇక మీదట అయినా లావణ్య త్రిపాఠి రెచ్చిపోతే ఇక వరుస ఆఫర్లు రావడం పక్కా అని చెప్పొచ్చు.                                        

మరింత సమాచారం తెలుసుకోండి: