అందులో భాగంగా ఆమె ఇటీవల నటించిన చిత్రం పెంగ్విన్. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్లో కాకుండా..డైరెక్ట్గా ఓటీటీలో విడుదలై పరవాలేదని పించింది. ఇక ఆమె నటించిన మరో చిత్రం మిస్ ఇండియా.. మహిళలపై జరిగే వేధింపుల నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా కూడా ఓటీటీలో విడుదల అయింది. ఈ సినిమాలతో పాటు ‘గుడ్ లక్ సఖి’ సినిమా చేస్తోంది. ఈ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను థియేటర్స్లోనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని జూన్ 3న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేసారు.
దీంతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాదు తమ ఫేవరేట్ హీరోయిన్ సినిమా ఓటీటీలో విడుదల చేయకుండా... థియేటర్స్లో విడుదల చేస్తుండటంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో జగపతి బాబు, ఆది పినిశెట్టి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. గుడ్ లక్ సఖి అంటూ వస్తున్న ఈ చిత్రానికి ఎక్కువగా మహిళలే పని చేస్తున్నారట.
ఈ చిత్రానికి శ్రావ్య వర్మ సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం లో కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. కీర్తి సురేష్ షూటర్ గా నటిస్తోంది. గ్రామీణ ప్రాంతం నుంచి యువతి ఎలా షూటింగ్లో పాల్గొని పతాకాలు గెలుచుకుందనేది ఈ స్టోరీ. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.