ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ప్రముఖ సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు దివంగత నటుడు చిరంజీవి సర్జా తమ్ముడు ధృవ్ సర్జా హీరోగా నటించిన చిత్రం "పొగరు".టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న హాట్ బ్యూటీ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.నంద కిషోర్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కించబడింది..ఇక ఈ చిత్రాన్ని డి.ప్రతాప్ నిర్మించాడు. చందన్ శెట్టి, అర్జున్ జన్యలు సంగీతం అందించారు. ఇక వీరి ఇరువురి సంగీతంలో రూపొందిన 'కరాబు మైండు కరాబు' అనే ఒక్క పాట..పెద్ద హిట్ అయ్యి యు ట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

ఇక ఈ పాట ఈ డబ్బింగ్ సినిమా పై అందరి దృష్టి పడేలా చేసింది. కానీ ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను మ్యాచ్ చెయ్యడంలో పూర్తిగా విఫలమయ్యింది అనే చెప్పాలి. అయినప్పటికీ హాట్ బ్యూటీ రష్మిక మందన తెలుగులో టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడం వలన ఈ హాట్ హీరోయిన్ క్రేజ్ వల్ల.. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది.'పొగరు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.7కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం 2.18 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో ఈ చిత్రం కొన్న బయ్యర్లు 2 కోట్ల వరకూ నష్టపోయారు.దీంతో ఈ సినిమా తెలుగులో ప్లాప్ గా నిలిచింది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ ఇంకా గాసిప్స్ అలాగే వసూళ్ల వివరాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: