యంగ్ హీరో నిఖిల్ దర్శకుడు చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2014లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఇందులో నితిన్ సరసన కలర్స్ స్వాతి నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అటు హీరోయిన్ ఇటు హీరో నిఖిల్ కు మంచి బ్రేక్ ఇచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కేంద్రంగా నడిచే ఈ సినిమా స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా సీక్వెల్ తీయాలని కరోనా లాక్ డౌన్ కు ముందే ప్రణాళికలు మొదలయ్యాయి. అయితే ఊహించని రీతిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ఈ సీక్వెల్ పట్టాలెక్కేందుకు కాస్త ఆలస్యమైంది. అప్పట్లో ఈ సీక్వెల్ లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించబోతున్నారని వార్తలు గట్టిగానే వినిపించాయి.

అయితే ఇప్పుడు మరోసారి కార్తికేయ సీక్వెల్ గురించి కొత్త కొత్త వార్తలు తెర పైకి వస్తున్నాయి. అంతేకాదు  ఇప్పటికే గుజరాత్ లో ఈ సినిమాకు సంబంధించి మొదటి వారంలో షూటింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ కి బదులు, గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిపిస్తోంది. ఇటీవలే శ్రీకారం సినిమాలో శర్వానంద్ తో జతకట్టిన ఈ భామ ఇప్పుడు కార్తికేయ సీక్వెల్ లో నిఖిల్ తో ఆడిపాడనున్నట్లు... టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో కలర్స్ స్వాతి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుందట.

పెళ్లి చేసుకొని ప్రస్తుతం కెమెరా కి దూరంగా ఉంటున్న స్వాతి... డైరెక్టర్ చందు మొండేటి రిక్వెస్ట్ చేయడంతో స్పెషల్ గెస్ట్ గా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా కార్తికేయ సీక్వెల్ గురించి పలు వార్తలు తాజాగా సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఈ చిత్రం గురించి అధికార ప్రకటన వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: