
ఇక ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా దర్శకుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ మూవీ భారీ కమర్షియల్ సక్సెస్ అందుకని గత రికార్డులను తిరగరాయడం ఖాయమని పలువురు ప్రేక్షకులు అభిమానులు అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు తమ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఇస్తున్న ఆర్ఆర్ఆర్ యూనిట్ నేడు కొద్దిసేపటి క్రితం పెట్టిన ఒక పోస్టు సోషల్ మీడియాలో మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుంది.
హెచ్చరిక ఆయన నిప్పులా రగులుతున్నాడు దయచేసి ఎప్పటికప్పుడు అందరూ వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ఆర్ఆర్ఆర్ యూనిట్, ప్రస్తుతం మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని పెట్టిన ఈ పోస్ట్ పై పలువురు అభిమానులు, ఈ విధంగా వెరైటీ గా కూడా ప్రమోషన్ చేస్తారా అంటూ ఒకింత సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.....!!