దక్షిణాది అగ్ర దర్శకుల్లో రాజమౌళి తరువాత చెప్పుకోదగ్గ దర్శకుల్లో శంకర్ ఒకరు.నిజానికి రాజమౌళి కంటే కూడా గొప్ప ప్రతిభ గల దర్శకుడు. ఎందుకంటే ఈయన స్టార్టింగ్ నుంచే దేశం గర్వించదగ్గ సినిమాలు తెరకెక్కించాడు.భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ హిట్టు మీద హిట్టు అందుకుంటున్నాడు ఈ దర్శకుడు. కాని రాజమౌళి బాహుబలితో తెప్పించిన సునామీతో శంకర్ కాస్త వెనకపడ్డాడు. అప్పటికి రోబో 2.0తో ప్రయత్నించాడు కాని కుదర్లేదు.


 ఇక భారతీయుడు 2 తో అయినా గట్టిగా ప్రత్నిద్దాం అంటే ఆ సినిమా వివాదాల్లో చిక్కుకోవడం శంకర్ పై కోర్టులో కేసు వెయ్యడం వంటి షాకులు తగిలాయి. ఇక రీసెంట్ గా శంకర్ రెండు సినిమాలను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. హీరో రామ్ చరణ్ తో ఓ సినిమా అలానే.. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే రణవీర్ సింగ్ తో చేయబోయే కాన్సెప్ట్ 'అపరిచితుడు' రీమేక్ అని వెల్లడించారు. పదిహేనేళ్ల క్రితం వచ్చిన 'అపరిచితుడు' కథలో మెయిన్ పాయింట్ తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు.


దీంతో 'అపరిచితుడు' చిత్రనిర్మాత ఆస్కార్ రవిచంద్రన్.. దర్శకుడు శంకర్ కు లీగల్ నోటీసులతో పాటు ఓపెన్ లెటర్ పంపించినట్లు తెలుస్తోంది.తన అనుమతి లేకుండా శంకర్ సినిమాను రీమేక్ చేస్తుండడంతో రవిచంద్రన్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తను నిర్మించిన 'అపరిచితుడు' సినిమాలో మెయిన్ ప్లాట్ తీసుకొని దాన్ని హిందీలో శంకర్ తెరకెక్కిస్తున్నాడని తెలిసి షాక్ అయ్యానని రవిచంద్రన్ లేఖలో పేర్కొన్నారు.


దీనివల్ల కూడా శంకర్ కి గట్టి షాకే తగిలింది. ఇలా వెంట వెంటనే షాకుల మీద మీద షాకులు తగిలించుకొని ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: