టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఒక మంచి గుర్తింపు ఉంది. అందులో చిరంజీవి,పవన్ కళ్యాణ్ ,నాగబాబు వంటి వారు సాధించలేని ఘనత కేవలం  రామ్ చరణ్   మాత్రమే సాధించి చూపించారు. అదేమిటంటే,  తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు సొంత ప్రొడక్షన్ హౌస్ లు  ఉన్నాయి. ఈ విభాగంలోని ఎన్టీఆర్ ఫ్యామిలీ కి సంబంధించి ఎన్. ఏ. టీ-రామకృష్ణ, ఏఎన్నార్ కు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు ఫ్యామిలీ కి సంబంధించి సురేష్ ప్రొడక్షన్ లు ఉన్నాయి. ఇది ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి. అంతేకాకుండా కృష్ణ ఫ్యామిలీకి సంబంధించి పద్మాలయ స్టూడియో తో పాటు పలు ప్రొడక్షన్ సంస్థలు ఉన్నాయి.


ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించిన అంజనా ప్రొడక్షన్ చిరంజీవి , ఆయన తన పెద్ద తమ్ముడు నాగబాబు తో స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్ లో చిరంజీవి యాక్ట్ చేసిన రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, స్టాలిన్ వంటి సినిమాలతో సక్సెస్ ను ఇవ్వలేకపోయారు చిరు. ఇక బావ గారు బాగున్నారు సినిమా తప్పా అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో మరో హిట్ సినిమా నిర్మించలేక పోయారు. ఇక అంతేకాదు నాగబాబు నటించిన ఏ ఒక్క  సినిమా కూడా ఇదే బ్యానర్ పై హిట్ అవ్వలేదు. ఇక పవన్ కళ్యాణ్ తో నిర్మించిన గుడుంబా శంకర్ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఆ తర్వాత తీసిన రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ కూడా ఈ రకంగా డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. ఇక నాగ బాబు హీరోగా కౌరవుడు అనే సినిమా నిర్మించిన అది కూడా ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. ఇకపోతే మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ కూడా ఆయన పేరుతో "పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్"అనే పేరుతో బ్యానర్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లో ఫస్ట్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ను నిర్మించారు. కానీ ఈ సినిమా కూడా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అంతే కాకుండా ఆ తరువాత నితిన్ హీరోగా "ఛల్ మోహన్ రంగ" సినిమా ను  నిర్మించగా అది కూడా ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది.

ఇక చిరంజీవి తన బామ్మర్ది అల్లుఅరవింద్ బ్యానర్ పై  గీతాఆర్ట్స్ మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. కానీ తమ్ముడు నాగబాబు ప్రారంభించిన అంజనా ప్రొడక్షన్ మాత్రం మెగా ఫ్యామిలీ అసలు కలిసి రాలేదు.

మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ తన తండ్రి సినిమా రీ ఎంట్రీ కోసం "కొణిదెల ప్రొడక్షన్ హౌస్" ను స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్ లో మొదటి  సినిమా గా వి.వి. వినాయక్ దర్శకత్వంలో "ఖైదీ నెంబర్ 150 "సినిమా నిర్మించగా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో మెగా ఫ్యామిలీకి ప్రొడక్షన్ కలిసి రాదన్న అందరి వాదనలను పటాపంచలు చేస్తూ రామ్ చరణ్ నిర్మాతగా సక్సెస్ సాధించాడు.

ఆ తర్వాత చిరంజీవి రీసెంట్ గా నటించిన  సినిమా "సైరా నరసింహారెడ్డి". ఈ సినిమాని పలు భాషల్లో రిలీజ్ చేసి పర్వాలేదు అనిపించుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా 3 వ సినిమాతో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు రామ్ చరణ్. కొణిదెల ఫ్యామిలీ లో ఎవరికి కలిసిరాని ప్రొడక్షన్ హౌజ్  రామ్ చరణ్ కి మాత్రమే బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: