కరోనా కారణంగా ఆర్థికంగా లబ్ధి పొందినది ఏదైనా ఉంది అంటే, అది ఒక్క ఓటీటి వేదిక మాత్రమే అని ఆలోచించకుండా, డౌట్ లేకుండా టక్కున చెప్పేయొచ్చు. కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ భారీగా నష్ట పోతే, ఒటిటి మాత్రం అందుకు భిన్నంగా అధికంగా వేగాన్ని పుంజుకుంది. కోవిడ్ టైంలో కాలు బయటకు పెట్టలేని పరిస్థితిలో ఉన్న జనాలు సైతం  ఒటిటి లకు బాగా అలవాటు పడ్డారు. దాంతో లాక్‌డౌన్‌ సమయంలో ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఓటీటీ వేదిక. లాక్ డౌన్ తో పర్యావరణం కూడ కాస్త ఫ్రెష్ అప్ అయింది. ఇది నిజంగా  సంతోషించదగ్గ విషయమే. కాగా ఒటిటి విషయానికి వస్తే  థియేటర్లు క్లోజ్  అవడంతో ఈ వేదికకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సరికొత్త యాప్ లు అందుబాటులోకి వచ్చి క్రేజీ ఆఫర్లతో వీక్షకులను ఆకట్టుకున్నాయి.

వెబ్ సిరీస్ ల జోరు కూడా పెరిగింది. స్టార్ హీరోయిన్లు సైతం జత కావడంతో వీటికి ఫాలోవర్స్ భారీగా పెరుగుతున్నారు.
చిన్న సినిమాల నుండి భారీ ప్రాజెక్టుల వరకు చాలా సినిమాలు ఓ టి టి బాటపడుతున్నాయి. ఫ్యాన్సీ డీల్స్ ఇస్తుండడం తో క్రేజి చిత్రాలు సైతం ఒ టి టి లో రిలీజ్ అయ్యేందుకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే చాలా చిత్రాలు ఓటీటీ వేదికపై విడుదలయ్యి మిశ్రమ ఫలితాలను తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఇంకొన్ని సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ అయ్యాయి. చిత్రసీమలో మొదటి నుంచి వస్తున్న శుక్రవారం సెంటిమెంట్ అందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఓటీటీ వేదికపై రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాయి. ఇక ఈ శుక్రవారం రిలీజ్ అయిన మూవీస్ ఏమిటో ఓ లుక్కేద్దాం. ఇందులో విద్యాబాలన్ నైటీనిచ్చిన షేర్ని మూవీ ఉంది. ఈ సినిమా అమెజాన్ లో విడుదల కానుంది. ప్రియదర్శి నైటీనిచ్చిన ఇన్ ది నేమ్ అఫ్ గాడ్ మూవీ ఆహాలో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ధనుష్ నటించిన జగమే తంత్రం నెట్ ఫ్లిక్ లో విడుదల కానుంది. ఇవి కాకుండా ఫాదర్‌హుడ్‌, ది రేషనల్‌ లైఫ్‌, బ్లాక్‌ సమ్మర్‌ సీజన్‌ 2 , ఎ ఫ్యామిలీ, ఎలైట్‌ సీజన్‌ 4, అఫీషియల్‌ సీక్రెట్స్‌, ది అడ్వంచర్స్‌ ఆఫ్‌ పూల్ఫ్‌బాయ్‌, మోహన్ లాల్ నటించిన కమ్మర సంభవం కంటి మరికొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలో ఎన్ని వ్యూస్ సాధిస్తాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: