కోలీవుడ్ హీరో ధనుష్ వరస హిట్స్ తో దూసుకుపోతూ కోలీవుడ్ టాప్ హీరోల రేసులోకి ఎంటర్ అయిపోయాడు. జాతీయ స్థాయి ఉత్తమ నటుడుగా కూడ ధనుష్ కు అవార్డు రావడంతో పాటు అతడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పై పడి ఇక్కడ కూడ సినిమాలు అంగీకరిస్తూ ఉండటంతో ధనుష్ దక్షిణాది సినిమా రంగంలో పూర్తిగా స్థిరపడ్డాడు అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో ధనుష్ లేటెస్ట్ గా కట్టుకుంటున్న ఇల్లు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలోని పోయిస్ గార్డెన్ ప్రాంతంలో కొత్త ఇంటి నిర్మాణానికి ధనుష్ భూమి పూజ చేశాడు. రజనీకాంత్ ఇంటికి చాల దగ్గరగా ఉండే ఈ ఇంటికి సంబంధించిన వార్తలు వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగడం సహజం. 19000 చదరపు గజాల్లో ఈ ఇంటి నిర్మాణం జరుగుతోంది. నాలుగు అంతస్తులుగా నిర్మిస్తోన్న ఈ భావన కోసం ధనుష్ 150 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ ఇంటిలోని గదుల ఇంటీరియర్ డెకరేషన్ కోసమే దాదాపు 15 కోట్లకు పైగా ధనుష్ ఖర్చుపెడుతున్నట్లు టాక్. ప్రస్తుతం ధనుష్ హాలీవుడ్ లో ‘గ్రే మ్యాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే అమెరికా వెళ్లాడు. అక్కడ ఈ మూవీ షూటింగ్ కొనసాగిస్తూనే తన మామ రజినీకాంత్ ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షల కోసం రజనీకాంత్ వెంట ఉంటున్నాడు.

వచ్చేనెల అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత ధనుష్ కార్తీక్ నరేన్ దర్శకత్వంలో మరొక మూవీని చేయబోతున్నాడు. ప్రస్తుతం ధనుష్ దండయాత్ర టాలీవుడ్ పై కూడ ప్రారంభం అయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీ అదేవిధంగా మైత్రీ మూవీస్ నిర్మాణంలో మరో భారీ మూవీ ధనుష్ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలలో ఏ ఒక్క సినిమా సూపర్ హిట్ అయినా ధనుష్ మ్యానియా తెలుగు రాష్ట్రాలలో కూడ విపరీతంగా పెరిగే ఆస్కారం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: