
ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ దేవి శ్రీ ప్రసాద్ కి ఒక గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని దేవిశ్రీప్రసాద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆయన తన ట్విట్టర్ పోస్టులో “రాక్స్టార్”, “ఐకాన్ స్టార్” అల్లు అర్జున్ నుంచి ఓ సర్ ప్రైస్ బహుమతి. నా ప్రియమైన బ్రదర్ బన్నీ బాయ్ కి చాలా ధన్యవాదాలు.. వాట్ ఎ లవ్లీ ఆశ్చర్యం!! పూర్తిగా అన్ ఎక్స్పెక్టెడ్ !! డామ్ స్వీట్ ఆఫ్ యు" అని పేర్కొన్నారు. అంతేకాకుండా అల్లు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో ఒక వీడియో రికార్డు చేసి తన అభిమానులకు చూపించారు.
ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. "బన్నీ బ్రదర్ నా కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. అది ఏంటో చూద్దాం" అని గిఫ్ట్ ఓపెన్ చేసారు. అయితే అల్లు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ ఒక ఎల్ఈడీ బోర్డ్ కాగా దానిపై "రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ డి.ఎస్.పి" అని రాసి ఉంది. అయితే పని దేవిశ్రీప్రసాద్ దానిపైన యాడ్ చేసిన కబడ్డీ గానే ఎర్రటి లైట్లతో మిరుమిట్లు గొలుపుతూ రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ అంటూ కనిపించింది. ఇకపోతే పుష్ప బృందం ఇటీవల సికింద్రాబాద్లో షూటింగ్ ప్రారంభించింది. త్వరలోనే మూవీ యూనిట్ బృందం గోవాకు వెళుతుంది. పుష్ప పార్ట్ 1 ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది, రెండవ భాగం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.