దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గమ్యం మూవీతో శర్వానంద్ మంచి విజయం సాధించాడు. ఆ తరువాత సినిమాలు చేసిన మంచి విజయం అందుకోలేదు. ఆ తరువాత కొత్త దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో వచ్చిన రన్ రాజా రన్ తో మంచి విజయం అందుకున్నాడు. ఈ సినిమాతో శర్వానంద్ కు మంచి గుర్తింపు వచ్చింది.దర్శకుడు క్రాంతి మాధవ్ తీసిన మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు సినిమా లో నటించాడు. ఈ సినిమా మంచి లవ్ కంటెంట్ తో వచ్చిన సినిమా. ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా శర్వానంద్ కెరీర్ లో నిలిచిపోయింది.ఆ తరువాత సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో వచ్చిన శతమానంభవతి సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. ఈ సినిమాతో శర్వానంద్ కు ఫ్యామిలీ హీరో గా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత మారుతి దర్శకత్వంలో మహానుభావుడు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా మంచి కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఆ తరువాత తమిళ్ లో హిట్ అయిన ఫీల్ గుడ్ మూవీ 96 తెలుగు రీమేక్ లో సమంతతో కలిసి నటించాడు. ఈ సినిమా తెలుగులో అంతగా ఆకట్టుకోలేదు. ఇటీవల శర్వానంద్ శ్రీకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు.
ఇదిలా ఉండగా శర్వానంద్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా షూటింగ్ ప్రారంభించాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించనున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. దేవిశ్రీప్రసాద్ మొదటి సారి శర్వానంద్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా అయిన శర్వానంద్ కు మంచి విజయం అందిస్తుందో లేదో చూడాలి