భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యున్నతంగా చిత్రీకరిస్తున్న ఈ గొప్ప సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తుండగా వారిద్దరికీ జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తున్నారు.

స్వరవాణి కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన అనేకమంది దిగ్గజ నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్న ఈ మూవీకి కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్స్, మోషన్ పోస్టర్ ప్రేక్షకాభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు నింపాయి.

ఇక ఈ సినిమా నుండి దోస్తీ అనే పల్లవి తో సాగె ఫస్ట్ సాంగ్ ని ఆగష్టు 1న ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపింది. కాగా ఈ సాంగ్ ని ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడైన అమిత్ త్రివేది ఆలపించినట్లు తెలుస్తోంది. దానితో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ లో కూడా ఆనందం మిన్నంటుతోంది. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతోందో తెలియాలి అంటే మరొక నాలుగు రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రప్రంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది. మరి విడుదల తరువాత ఆర్ఆర్ఆర్ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో ఎన్ని బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.....!!    

 

మరింత సమాచారం తెలుసుకోండి: