సాహో
సినిమా వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా
ప్రభాస్ నుంచి ఇంతవరకు ఒక్క
సినిమా అంటే ఒక్క
సినిమా కూడా రాలేదు. ఇదిగో అదిగో అంటూ కాలం గడిపేస్తున్నారు కానీ
ప్రభాస్ తన తదుపరి
సినిమా రిలీజ్ డేట్ ఏంటి అనేది ఇంకా చెప్పట్లేదు. నిజానికి జూలై 30న ఈ
సినిమా విడుదల అనుకున్నారు కానీ
కరోనా వల్ల షూటింగ్ పోస్ట్ చేయడం రిలీజ్ డేట్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. దాంతో మరొకసారి
సినిమా కొరకు ఎదురు చూడక తప్పలేదు. ఇప్పటికే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడగా ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అని డైరెక్ట్ గా
ప్రభాస్ ను ప్రశ్నిస్తున్నారు అభిమానులు.
అయితే
ప్రభాస్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన తదుపరి చిత్రాల చిత్రీకరణలో నిమగ్నమైపోయాడు. కే జి ఎఫ్
సినిమా తో ఒక్కసారిగా పాన్
ఇండియా రేంజ్ దర్శకుడు అయిపోయిన
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సాలార్ అనే
సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో
శృతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా ఇది కూడా సెట్స్ పైన ఉండడం విశేషం. మరో వైపు
బాలీవుడ్ సినిమా అది పురుష్ లో కూడా
ఇవి చాలవన్నట్లు
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే
సినిమా కూడా రామోజీ ఫిలిం సిటీలో ఇటీవల మొదలైంది. ఈ
సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్న
ప్రభాస్ తన
సినిమా విడుదలను మాత్రం సంవత్సరాలు లయే చేయడం ఆయన ఫ్యాన్స్ నీ నిరాశ పరుస్తోంది. తాజాగా రాధేశ్యామ్
సినిమా దసరా కి గాని
సంక్రాంతి కి గానీ వస్తుందని వార్తలు వస్తుండగా ఇప్పుడు ఆ
సినిమా సమ్మర్ కి పోతుందనే వార్త
ప్రభాస్ అభిమానులను ఎంతగానో కలచివేస్తుంది. ఈ
సినిమా నాలుగు ఐదు భాషల్లో విడుదల అవుతుండటంతో ఆ భాషలో సినిమాను డబ్ చేయడానికి ఇంకొంత సమయం పట్టేలా ఉంది. అలా చేయకపోతే సినిమాకు భారీ నష్టాలు ఏర్పడే ఛాన్స్ లు ఉన్నాయట. దాంతో బిజినెస్ పరంగా ఆలోచించి ఇంకా కొన్ని రోజులు
సినిమా ను పోస్ట్ పొన్ చేస్తున్నారట. ఈ లెక్కన రాధేశ్యామ్
సినిమా సమ్మర్ కి వెళ్ళిన ఆశ్చర్యపోనవసరం లేదు.