నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ రెండు రోల్స్ చేస్తున్న ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దీనిని ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. యువ నటి ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు.

కొన్నాళ్ల క్రితం ఈ సినిమా నుండి రిలీజ్ అయిన రెండు టీజర్స్ మంచి రెస్పాన్స్ అందుకుని సినిమాపై అందరిలో భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుండిగా దీని ఫస్ట్ సాంగ్ ని రేపు విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీ తరువాత మైత్రి మూవీ మేకర్ వారి బ్యానర్ పై గోపీచంద్ మలినేని తీయనున్న సినిమా చేయనున్నారు బాలకృష్ణ. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుండగా దీనిని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందు తీసుకురానున్నారు. అయితే త్వరలో బి గోపాల్ తో కూడా బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నారు అంటూ కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే.

కాగా ప్రస్తుత పరిస్థితుల్లో బాలకృష్ణ ఆయన సినిమాని ప్రక్కన పెట్టినట్లు టాలీవుడ్ వర్గాల న్యూస్. ఈ రెండు సినిమాల తరువాత అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ ల సినిమాలు ఇప్పటికే బాలకృష్ణ లైన్లో పెట్టారని, వచ్చే ఏడాది వీటికి సంబంధించి అధికారికంగా ప్రకటనలు రానున్నట్లు సమాచారం. కాగా దీనిని బట్టి ఇక ఇప్పట్లో బాలకృష్ణ, బి గోపాల్ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ లేనట్లే అని తెలుస్తోంది. గతంలో బాలకృష, బి గోపాల్ ల కాంబినేషన్లో పలు బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. మరి మళ్ళి ఎప్పుడు ఈ సూపర్ కాంబోలో మూవీ వస్తుందో తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: