సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ టైం టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా రాజకుమారుడు. ఎంతో భారీ రేంజ్ లో రాఘవేంద్ర రావు తీసిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సక్సెస్ అందుకుంది. ఇక హీరోగా తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన మహేష్ అక్కడి నుండి ఒక్కో సినిమాతో మంచి సక్సెస్ లు సాధిస్తూ హీరోగా భారీ క్రేజ్ ని పాపులారిటీని దక్కించుకున్నారు.

ఇక ప్రస్తుతం మహేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా యువ దర్శకుడు పరశురామ్ దీనిని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. మహేష్ ఈ సినిమాలో ఒక వడ్డీ వ్యాపారిగా కనిపించనుండగా కీర్తి బ్యాంక్ ఉద్యోగిని పాత్ర చేస్తున్నట్లు సమాచారం. దీని తరువాత త్రివిక్రమ్, రాజమౌళి లతో వరుసగా సినిమాలు చేయనున్నారు మహేష్ బాబు. అయితే అసలు విషయం ఏమిటంటే త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు బుల్లితెరపై సందడి చేయనున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జెమినీ టివిలో ప్రసారం అవుతున్న క్రేజీ షో ఎవరు మీలో కోటీశ్వరులు షో కు ప్రత్యేకంగా మహేష్ బాబు హాజరవుతున్నారట.

కాగా ఆయన పై ఎపిసోడ్ ని నేటి నుండి షూట్ చేయనుండగా దానిని రాబోయే దసరా పండుగ కానుకగా జెమినీ టివి టెలికాస్ట్ చేయనుందని సమాచారం. గతంలో మహేష్ నటించిన భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ విచ్చేసిన విషయం తెలిసిందే. మొదటి నుండి మహేష్ తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. అయితే ప్రస్తుతం ఈ షోకి మహేష్ ని ఎన్టీఆర్, కొరటాల శివ, అలానే రామ్ చరణ్ కలిసి ఆహ్వానించారని, మరోవైపు చరణ్ తో కూడా తనకు ప్రత్యేక అనుబంధం ఉండడంతో మహేష్ కాదనలేకయారని వినికిడి. ఏది ఏమైనప్పటికీ ఇది కనుక నిజం అయితే త్వరలో బుల్లితెరపై సూపర్ స్టార్, యంగ్ టైగర్ ఇద్దరినీ కలిపి చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: