టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ త్వరలో విడుదలకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కూడా మరొక హీరోగా చేస్తున్న ఈ సినిమాని ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో భారీగా తెరకెక్కించగా దానయ్య నిర్మించారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం గా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్ ల ఫస్ట్ లుక్ టీజర్లు ఇటీవల యూట్యూబ్ లో విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్నాయి. అయితే దీనితో పాటు నెక్స్ట్ శంకర్ మూవీని కూడా ఇటీవల మొదలెట్టారు చరణ్.

కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు టాక్. అందుతున్న సమాచారం బట్టి దీనిని వీలైనంత వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు యునిట్ సన్నాహాలు చేస్తోందట. ఇక దీని తరువాత రామ్ చరణ్, యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా చేయనున్నారు. ప్రఖ్యాత సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ మూవీని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇప్పటికే వచ్చింది. అలానే దీని అనంతరం డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై దానయ్య నిర్మాతగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా చరణ్ ఒక సినిమా చేయనున్నారు. కొద్దిరోజుల క్రితం చిరు, చరణ్ లతో ఈ సినిమా విషయమై ప్రశాంత్ ప్రత్యేకంగా సమావేశమైన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

కాగా లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల న్యూస్ ప్రకారం ఇవి మాత్రమే కాకుండా, రామ్ చరణ్ త్వరలో తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మరొక సినిమాని కూడా అనౌన్స్ చేయనున్నారని, ఇప్పటికే ఆ రెండు సినిమాలకు సంబంధించి ఆయా దర్శకుల నుండి కథలు కూడా విన్న చరణ్, వాటి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పినట్లు టాక్. అన్ని అనుకున్నట్లు జరిగితే, మరికొద్దిరోజుల్లో ఆ రెండు సినిమాల యొక్క ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందట. మరి దీనిని బట్టి చూస్తుంటే చరణ్ ప్రస్తుతం వేగవంతంగా ఒకదానివెంట మరొకటి ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు ఎంచుకుని ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. చరణ్ మీరు కాస్త స్పీడ్ తగ్గించండి అంటూ కొందరు తెలుగు ఆడియన్స్ ఆయన సినిమాల స్పీడ్ ని ఉద్దేశించి తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: