నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం విడుదల చేస్తున్న
శ్యామ్ సింగరాయ్
సినిమా విషయంలో మళ్లీ కన్ఫ్యూజన్ లో పడ్డాడు అని సోషల్ మీడియాలో వార్తలు బాగా వస్తున్నాయి.
రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో
నాని ఫాంటసి సినిమాగా ఈ చిత్రాన్ని చేయగా ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటించడంతో ఒక సారి గా సినిమాపై అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది.
సాయి పల్లవి కృతి శెట్టి
మడోన్నా సెబాస్టియన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది
నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ
సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రాన్ని
డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. వాస్తవానికి
దసరా కి గానీ
దీపావళి కి కానీ ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ ఆ సీజన్లో ఇతర సినిమాలు వస్తుండటంతో సోలో గా రావాలని ఇష్టపడ్డ చిత్ర యూనిట్
డిసెంబర్ 24వ తేదీని ఎంచుకుంది.
దానికి ముందు
అల్లు అర్జున్ నటించిన పుష్ప
సినిమా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విడుదల ఆ తేదీ ని పోస్ట్
ఫోన్ చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందట. దానికి కారణం లేకపోలేదు. నందమూరి
బాలకృష్ణ నటించిన అఖండ
సినిమా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నాలు చేస్తుండగా
బాలయ్య కు ఎదురు నిలవలేక పోటీ కి రాలేక కలిసిరావడం ఇష్టం లేక
నాని తమ సినిమాను పోస్ట్
ఫోన్ చేసుకునే విధంగా ఆలోచన చేస్తున్నాడట. ఇప్పటికే ఆయన గత రెండు చిత్రాల్లో ఓ టి టి లో విడుదలై భారీ ఫ్లాప్ తో పాటు ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఈ
సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.