దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకుడలుగా ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా పనుల్లో బిజీ గా ఉన్నాడు, ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా ను సంక్రాంతి కానుక గా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి, ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయబోతున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి, అయితే ఇప్పటికే రాజమౌళి తండ్రి ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్  కథను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా లో మహేష్ బాబు హీరో గా నటించగా ఆయన పాత్రకు ధీటుగా ఉండే విలన్ పాత్ర కోసం ఇప్పటికే రాజమౌళి ఒక స్టార్ హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 అయితే అందులో భాగంగా మహేష్ బాబు సినిమా లో కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ను తీసుకోవాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు, ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజు ల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో మహేష్ బాబు నటించడానికి రెడీ గా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: