పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబోలో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ 'భీమ్లా నాయక్'. మలయాళంలో ఘన విజయం అందుకున్న 'అయ్యప్పనుమ్‌ కోషియమ్‌' చిత్రానికి రీమిక్ ఇది. ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించినప్పటి నుండి పూటకో న్యూస్ అభిమానుల్ని టెంప్ట్ చేస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ మూవీ నుండి నాలుగో పాట పాటను విడుదల చేసింది చిత్ర బృందం. మొదట ఈ పాటను డిసెంబర్ 1 న రిలీజ్ చేయాల్సి ఉండగా కలం కళాకారుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో వాయిదా పడింది. కాగా నేడు ఉదయం 10.08 కి విడుదల చేశారు. 'అడవి తల్లి మాట' అనే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

రామజోగయ్య గారు రచించిన ఈ పాట శ్రోతల ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ఈ పాట మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతుండగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12 న అనగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో పవన్‌ క్యారెక్టర్‌, రానా పాత్ర ఇలా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన నాలుగో పాట కూడా ఈ అంచనాలను మరో మెట్టు పెంచింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్లు, మూడు పాటలు పవన్ ఫ్యాన్స్ లో పవర్ ను పెంచాయి.  ఇవన్నీ కూడా తెలుగు ప్రేక్షకులను తెగ అలరిస్తున్నాయి.

'లా లా భీమ్లా' గీతం సందడి  అయితే మామూలుగా లేదు.. యూట్యూబ్ను షేక్ చేస్తూ జెట్ స్పీడ్ లో పరుగులు తీస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మాములుగా లేవు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: