టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ తీస్తున్న తాజా సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ మలయాళ యాక్టర్ ఫహాద్ ఫాసిల్ ప్రతి నాయకుడిగా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ నిర్మిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే టీజర్, సాంగ్స్, అలానే ట్రైలర్ రిలీజ్ అయి అందరిలో కూడా సినిమా పై భారీగా అంచనాలు పెంచిన విషయం తెలిసిందే.

తొలిసారిగా అల్లు అర్జున్ తన కెరీర్ లో చేస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఆయన ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఎంతో భారీగా అంచనాలు ఉన్నాయి, అలానే సాధారణ ఆడియన్స్ కూడా పుష్ప కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 1 ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా కోసం ఇప్పటికే పలు భాషల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేసిన యూనిట్, మొదట తెలుగులో ఈనెల 12న హైదరాబాద్ లో పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నేటి నుండి పనులు షురూ చేసిందని, దీనికి సంబంధించి రేపు ప్రకటన రానుందని టాక్.

అలానే దాని తరువాత అటు చెన్నై, బెంగళూరు, ముంబై ల్లో కూడా పలు ఈవెంట్స్, ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు పుష్ప యూనిట్ ఎంతో పక్కాగా ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మంచి యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. మరి అందరిలో విపరీతమైన అంచనాలు పెంచిన పుష్ప సినిమా రేపు విడుదల తరువాత ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: