ప్రస్తుతం పుష్ప సినిమాతో సినీ ఇండస్ట్రీలో కాస్త ఊరట లభించింది అని చెప్పవచ్చు. ఇక మిగిలింది rrr మూవీ ఒకటే ప్రస్తుతం ఈ సినిమా కోసం ఎంతో మంది అభిమానులు, ప్రేక్షకులు కూడా బాగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని రాజమౌళి డైరెక్షన్ చేయడం గమనార్హం. అందుచేతనే ఈ సినిమాకి ఇంతటి పాపులర్ రావడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక తెలుగులోకి మొదటిసారిగా కథానాయకి గా వచ్చింది హీరోయిన్ అలియా భట్.


అయితే తాజాగా ఈ సినిమాపై ఒక ముఖ్యమైన సమాచారాన్ని..RRR మూవీ మేకర్స్ తెలిపిన ప్రకారం ఈ చిత్రం గ్రాండ్ ఈవెంట్స్ ను ముంబైలో ప్లాన్ చేస్తున్నట్లు గా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక ఈ సినిమాని జనవరి 7వ తేదీన భారీగా థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇక తెలుగులో మరొకసారి ఈ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నారు. అందుచేతనే ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలోని సినిమా విడుదల కాని విధంగా ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.

ఇక తాజాగా ఈ సినిమా గ్రాండ్ ఈవెంట్ కు బాలీవుడ్ లోని కొంతమంది నటులు వచ్చే విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక ముంబైలో తెలుగు ఈవెంట్స్ కు, ప్రమోషన్లకు భారీ స్థాయిలోనే రెస్పాన్స్ ఉన్నది. ఇక ఈ సినిమాకి ముఖ్యఅతిథిగా అజయ్ దేవగన్ వస్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా ఆర్.ఆర్.ఆర్ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేయడం జరిగింది. ఈసారి ఏకంగా బాలీవుడ్ లో కూడా తన ప్రమోషన్ చాటాలని రాజమౌళి భావిస్తున్నట్లు గా  సమాచారం. ఇక ఈ సినిమా గ్రాఫిక్స్ తో, భారీ బడ్జెట్ తో ఇద్దరు స్టార్ హీరోలతో, కలిసి ఈ మూవీ తెరకెక్కించడం చాలా అద్భుతంగా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: