టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ తన పాపులారిటీని టాలీవుడ్ విపరీతంగా పంచుకున్నాడు, అయితే ఈ సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీతా గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ అన్ని వర్గాల ఆడియన్స్ మనసులు దోచుకొని టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇలా టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాతో ఒక అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు,  ఇప్పటివరకు మరే డబ్బింగ్ సినిమాకి రానంతగా 3.5  మిలియన్ లైక్స్ డియర్ కామ్రేడ్ మూవీ హిందీ వెర్షన్ కు దక్కాయి.

ఇది డబ్బింగ్  సినిమాలలో సరికొత్త రికార్డు గా చెబుతున్నారు, ఇది మాత్రమే కాకుండా ఈ సినిమా అప్ లోడ్ చేసిన రెండేళ్లలో 300 మిలియన్ పైచీలుకు వ్యూస్ క్రాస్ చేసింది, ఇలా డియర్ కామ్రేడ్ సినిమా సరికొత్త రికార్డ్ లను సృష్టించింది, 2019 జూలై 26 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫర్వాలేదు అని టాక్ ను సొంతం చేసుకున్నప్పటికి విమర్శకుల నుండి మాత్రం ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. డియర్ కామ్రేడ్ సినిమా లో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా రష్మిక మందన హీరోయిన్ గా నటించింది, ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించారు, ఈ సినిమాకు కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైజర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: