వకీల్ సాబ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం భీమ్లా నాయక్. సంక్రాంతికి విడుదల కావలసిన ఈ చిత్రం వాయిదా ఆట ఆడుతుంది.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారని అందరికి తెలుసు.

ఇది మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి అధికారిక రీమేక్ అనే విషయం కూడా తెలిసిందే. అయితే ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే తెలుగు రీమేక్ రన్ టైం చాలా తగ్గిస్తున్నట్లు టాక్ వినిపిస్తున్నట్లు సమాచారం.


‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా నిడివి 175 నిమిషాలు ఉంటుందట.. అంటే దాదాపు మూడు గంటలు. అయితే ఇక్కడ తెలుగు వెర్షన్ రన్ టైం విషయంలో మేకర్స్ కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సినిమా మొత్తం నిడివి కూడా కేవలం 2 గంటల 10 నిమిషాలు మాత్రమే ఉంటుందని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో నుంచి చాలా తక్కువ నిడివితో వస్తోన్న సినిమా ఇదేనని తెలుస్తుంది.

చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మాతృక స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేర్పులు కూడా చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని స్టార్ డమ్ ని దృష్టిలో పెట్టుకొని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని మరియు సాంగ్స్ ని కూడా జత చేశారట.మరో హీరో రానా కంటే పవన్ పాత్రకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రచార చిత్రాలు మరియు సినిమా టైటిల్ ని బట్టి మనకు అర్థం అవుతోంది.

కాకపోతే స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్ గా ఉండేందుకు సినిమా రన్ టైం మరీ రెండు గంటల పది నిమిషాలకు కుదించడం ఏంటని అభిమానులు బాగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ”భీమ్లా నాయక్” చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుందని పట్టుదల గల పోలీసు అధికారి – మాజీ సైనికాధికారి మధ్య అహం ఆత్మాభిమానం నేపథ్యంలో జరిగిన వైరాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తుంది.


భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్ మరియు రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారట.రావు రమేష్ ,మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు అలాగే నర్రా శ్రీను,కాదంబరి కిరణ్, చిట్టి ,పమ్మి సాయి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: