మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న భారీ టాక్ సినిమా సర్కారు వారి పాట.. ఈ సినిమా గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.ఎప్పుడూ సినిమా విడుదల అవుతుందా అని 12 తేదీ ఎప్పుడూ రిలీజ్ అవుతుందా అనే టెన్షన్ అందరికి ఉంది.సర్కారు వారి పాట' చిత్రం రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమని మహేష్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


'సర్కారు వారి పాట' సినిమాపై మహేష్ బాబు కూడా ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ రాజమౌళి తో  చేయడానికి రెడీ అయ్యాడు..ఆ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెల్లనుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. రాజమౌళి మహేష్ బాబు మూవీ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇంకా స్క్రిప్టు పనులు పూర్తి కాలేదని, జక్కన్నసినిమా స్క్రిప్టు పనులకు ఇంకా టైం తీసుకోబోతున్నాడని తెలుస్తోంది.


ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెల్లాలని భారీ ప్లాను లో ఉన్నారని తెలుస్తుంది.. మహేష్ మాత్రం ఈ గ్యాప్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడు. ఏదేమైనా రాజమౌళితో మహేష్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశను కలిగించింది..అడవి నేపథ్యంలో సినిమా కథ ఉండబోతుందని రచయిథ ఆల్రెడీ ఒక క్లూ ఇచ్చాడు.మొత్తానికి ఈ సినిమా వాయిదా పడినట్లే వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కనుంది..అప్పుడు కూడా జక్కన్న ఏదైనా మెలిక పెడతారెమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: