టాలీవుడ్
సినిమా పరిశ్రమలో
కామెడీ చిత్రాల హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు
అల్లరి నరేష్. అందరినీ కడుపుబ్బ నవ్వించే సినిమాలు చేసి అనతికాలంలోనే ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నాడు. అయితే ఆయన చేసే సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి. అలా ఆ
సినిమా లతో
అల్లరి నరేష్ క్రేజ్ మెల్లగా తగ్గి పోవడం జరిగింది. అంతే కాదు
కామెడీ సినిమాలు చేస్తే
అల్లరి నరేష్ సినిమాలు పెద్దగా ఆడేవి కావు. ఆ
జోనర్ లో సినిమాలు చేయొద్దని కొంత మంది ప్రేక్షకులు కూడా డైరెక్ట్ గా చెప్పేశారు. దాంతో ఈ
హీరో ఆ తరహా సినిమాలు చేయడం ఆపేశాడు.
సీరియస్ గా ఉండే కథలను చేయడం మొదలుపెట్టాడు. అలా నాంది
సినిమా ఆయనకు మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది అని చెప్పవచ్చు.
విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
సినిమా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ఆయన
అల్లరి నరేష్ ను కనిపించిన విధానానికి అందరు కూడా ఆశ్చర్యపోయారు. గతంలో
అల్లరి నరేష్ ను ఈ రేంజ్ లో చూపించిన దర్శకుడు లేడనే చెప్పాలి. దాంతో ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసి సూపర్ హిట్ చేశారు.
అలా కలిసి వచ్చిన
జోనర్ లో సినిమాలు చేయాలని
నరేష్ కూడా భావించాడు. అందుకే ఆ తరహా లో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా
నరేష్ హీరో గా నటిస్తున్న ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఇది నాంది
సినిమా తరహాలోనే ఉండబోతుంది అని అంటున్నారు. అంతేకాదు సభకు నమస్కారం అనే మరొక పొలిటికల్
థ్రిల్లర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు ఈ
కామెడీ హీరో. మరి
అల్లరి నరేష్ ఎంతవరకు ఈ చిత్రాలతో విజయం సాధించి హీరోగా నిలదొక్కు కుంటాడో చూడాలి. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించనుంది.