అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా దిల్ రాజు నిర్మాణంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రాజేంద్ర ప్రసాద్ ఇతర ప్రధాన పాత్రల్లో తెరకెక్కి 2019 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 మూవీ ఎంత పెద్ద భారీ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే.

 అలా ఎఫ్ 2 మూవీ మంచి విజయం సాధించడంతో ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఎఫ్ 3 మూవీ ని తెరకెక్కించారు. ఈ సినిమాలో కూడా వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ పాత్రలో నటించగా అతనితో పాటు సునీల్ , ఆలీ కూడా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

సినిమా నిన్న అనగా మే 17 వ తేదీన గ్రాండ్ గా థియేటర్ లలో విడుదలయ్యింది. ఎఫ్ 3 మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను సంపాదించుకుంది. ఎఫ్ 3 సినిమా ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎఫ్ 3 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ సోనీ లివ్  దక్కించుకున్నట్లు తెలుస్తోంది.  సోనీ లివ్ 'ఓ టి టి' సంస్థ ఎఫ్ 3 మూవీ 'ఓ టి టి' హక్కులను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సోనీ లివ్ 'ఓ టి టి' సంస్థ ఒకటి లేదా రెండు నెలల తర్వాత 'ఓ టి టి' స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: