ఇక 26/11 ఎటాక్స్ లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో హీరోగా అడివి శేష్ నటించగా హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సయి మంజ్రేకర్ నటించింది.తెలుగు మోడల్ శోభితా ధూళిపాళ ఒక కీలక పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్ ఇంకా రేవతి, సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల పాత్రలలో నటించి ప్రేక్షక లోకాన్ని మెప్పించారు. జూన్ మూడో తేదీన విడుదలైన ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి స్పందన దక్కుతోంది. సినిమా కలెక్షన్లు కూడా అంతకంతకూ బాగా పెరుగుతున్నాయి.


ఇక తాజాగా ఈ సినిమాను తాను వీక్షించినట్లు చెబుతూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మేజర్ సినిమా టీం మొత్తానికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అంటూ ఆయన ట్వీట్ మొదలు పెట్టారు. ఈ సినిమా హార్ట్ టచింగ్ సినిమా అని ఇంకా అడివి శేష్ వన్ మాన్ షో అని పేర్కొన్నారు. అడివి శేష్ మళ్లీ మ్యాజిక్ చేశాడు అని పేర్కొన్న ఆయన ప్రకాష్ రాజ్ ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇమిడిపోయారని అన్నారు.రేవతి, సాయి మంజ్రేకర్ ఇంకా శోభితా ధూళిపాళ, మాత్రమేగాక మిగతా పాత్రధారులందరూ సినిమాకు ప్రాణం పోశారు అని పేర్కొన్నారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారని ఇంకా దర్శకుడు శశి కిరణ్ తిక్కాది ఎక్స్లెంట్ వర్క్ అని అల్లు అర్జున్ కొనియాడారు. సినిమా మొత్తాన్ని కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్న ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రేక్షకుల ముందుకు ఇలాంటి ఒక హృదయాన్ని హత్తుకునే అనుభూతిని తీసుకు వచ్చినందుకు సూపర్ స్టార్ మహేష్ బాబుకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేజర్ సినిమా ప్రతి ఒక్క భారతీయుడి గుండెని కూడా తడుతుంది అంటూ ఆయన తన రివ్యూలో పేర్కొన్నారు. ఇక తాజాగా సినిమా యూనిట్ సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించింది.ఇక ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు శశికిరణ్ మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తన తండ్రి చనిపోయారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో రేవతి ఇంకా ప్రకాష్ రాజ్ పాత్రలు చూస్తుంటే ప్రేక్షకులు అందరి లాగే తనకు కూడా తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారని చెబుతూ, బాగా భావోద్వేగానికి గురయ్యారు. పక్కనున్న వారు ఆయను ఓదార్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: