నందమూరి
బాలకృష్ణ హీరోగా ఇప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకుల అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించిన
మాస్ మసాలా సినిమా విడుదల కావడానికి సిద్ధమయ్యింది. ఆ తరువాత
అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఓ
సినిమా చేయడానికి ఆయన సన్నాహాలు చేశారు. ఇప్పటికే ఈ
సినిమా దర్శకుడు
అనిల్ రావిపూడి స్క్రిప్ట్ పనులతో రెడీ గా ఉన్నాడు.
అక్టోబర్ నుంచి ఈ
సినిమా యొక్క షూటింగ్ మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నాడు.
ఆ విధంగా
బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ ఉండడం నందమూరి అభిమానులను ఎంతగానో ఆనందపరుస్తుంది. అఖండ
సినిమా అఖండ విజయాన్ని సాధించి హిట్
జోష్ లో ఇంకా ఉన్న నేపథ్యంలోనే ఆయన మరొక
మసాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతూ వార్త తెలియగానే వారిలో ఆనందం మరింత రెట్టింపు అయింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇకపోతే హిట్ దర్శకుడుతో తన తదుపరి
సినిమా చేయడం నందమూరి అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది.
అలా ఇప్పుడు అదే కాకుండా మరొక సినిమాను కూడా మొదలు పెట్టాలని
బాలకృష్ణ ఆలోచించడం విశేషం.
కృష్ణవంశీ దర్శకత్వంలో గతంలో రైతు అనే ఓ సినిమాను చేయదలచిన
బాలకృష్ణ ఎందుకో పలు కారణాలు వల్ల దాన్ని పక్కన పెట్టవలసి వచ్చింది తాజాగా ఆ సినిమాను మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నాడు. అన్ని బాగుంటే
బాలకృష్ణ 110 సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం అని అంటున్నారు.
గౌతమీపుత్ర శాతకర్ణి ప్లేస్లో ఈ
సినిమా తెరకెక్కవలసి ఉంది. అయితే
బాలకృష్ణ నటించే 100
సినిమా కాబట్టి ఆ పీరియాడికల్ చిత్రమే చేయడానికి
బాలకృష్ణ నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత తదుపరి కమిట్మెంట్ ల వల్ల ఈ సినిమాను చేయలేకపోయాడు. ఇప్పుడు 110వ సినిమాగా ఈ చిత్రం చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు.
అనిల్ రావిపూడి తర్వాత ఇంకొక
సినిమా మాత్రం
బాలకృష్ణ చేయవలసి ఉంది.