తెలంగాణ ప్రజలు మాత్రమే కాకుండా సినీ రాజకీయ ప్రముఖులు కూడా అమ్మవారికి బోనం సమర్పించి, తమ మొక్కును తీర్చుకున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కూడా బోనమెత్తిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మలయాళం బ్యూటీ అయిన ఈమె తెలంగాణ ఆడపిల్లలా బోనం ఎత్తి సందడి చేసింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న పండుగ సందర్భంగా సాయి పల్లవి బోనం ఎత్తలేదు కానీ విరాటపర్వం సినిమాలో ఆమె బోనం ఎత్తింది అయితే ప్రస్తుతం బోనం పండుగ ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా ప్రముఖ డైరెక్టర్ వేణు వూడుగల బోనాల పండుగను , తెలంగాణ సంస్కృతిని కండ్లకు కట్టినట్టు విరాటపర్వం సినిమాలో చూపించారు. ఇక ఈ నేపథ్యంలోనే లంగా వోణీ లో అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా బోనం ఎత్తుకొని వచ్చేసి విరాటపర్వం సినిమాకి చాలా హైలైట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతూ ఉండడంతో సాయి పల్లవి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. అయితే సాయి పల్లవి బోనం ఎత్తుకున్న ఫోటోలను షేర్ చేస్తూ బోనాలు శుభాకాంక్షలు అంటూ వేణు ఊదుగుల పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.