హీరో నాని చివరిగా అంటే సుందరానికి వంటి సినిమాతో ముందుకు వచ్చినా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో నాని లుక్స్, యాటిట్యూడ్,  హీరోయిన్ నజ్రియా ఇలా కొన్ని విషయాలు వల్ల ఈ సినిమా మీద ప్రేక్షకులలో చాలా ఆసక్తి కలిగినది. అయితే అసలు ఈ చిత్రం విడుదలైన తరువాత ఈ సినిమా పైన కామెంట్లు, ట్రోలింగులు భారీగా వినిపించాయి. అయితే ఎప్పటిలాగానే ఈ సినిమా ఫలితం కూడా బాగుందని నాని అంటూ ఉన్నారు . అయితే ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాత్రం ఈ సినిమా ఫలితం గురించి మాట్లాడడం జరిగింది. వాటి గురించి చూద్దాం.

సినిమా ఎక్కడో తేడా కొట్టింది.. అందుకు కారణం అంటూ ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది.. అంటే సుందరానికి సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.. పరుచూరి పలుకులు పేరిట తెలుగు సినిమా సంగతులను చెప్పే వాటిలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అంటే సుందరానికి సినిమా గురించి మాట్లాడుతూ అంటే సుందరానికి సినిమా కోసం డైరెక్టర్ తీసుకున్న పాయింట్ బాగానే ఉంది.. అయితే స్క్రీన్ ప్లే ఎక్కడో బెదిసి కొట్టడం వల్ల సినిమా గాడి తప్పింది అని తెలిపారు. దీంతో ఈ సినిమా ఫలితం కూడా చాలా ఇబ్బంది పెట్టింది అని తెలిపారు పరుచూరి గోపాలకృష్ణ.

మతంతార ప్రేమ కథ స్టోరీ లైన్ బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమాకు ముందు సాగే కొద్ది పాయింట్లు విమర్శించిందని పరుచూరి అభిప్రాయంగా తెలిపారు. ఇందులో క్లాస్ బ్యాక్ సన్నివేశాలు మలుపు ఎక్కువగా ఉండటంతో స్క్రీన్ పై సరిగ్గా లేకపోవడంతో ఈ సినిమా ఇలా అయింది అని తన మనసులో మాటగా తెలిపారు. సినిమాలలో ఇలాంటి సీన్లు ఎక్కువైతే ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లలో ఉండడానికి ఇష్టపడరు అని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.ఒక ప్రేమకుడి కథకు అవసరం లేని సన్నివేశాలను చూపించారని.. గతంలో ఇలాంటి వాటి మీద వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: