టాలీవుడ్ యువ హీరో లలో ఒకరు అయినటు వంటి శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శర్వా నంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించగా ,  శ్రీ కార్తిక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అక్కినేని అమలమూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా ,  ప్రియదర్శి ,  వెన్నెల కిషోర్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్ర లలో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది.  

ఇప్పటి వరకు ఈ మూవీ రెండు వారాల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఏ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల కొని ఉన్న సందర్భంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 7.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 8 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బడిలోకి దిగింది.

2 వారాల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఒకే ఒక జీవితం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 10.15 కోట్ల షేర్ ,  24.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.  దీనితో ఒకే ఒక జీవితం మూవీ రెండు వారాల బాక్స్ ఆఫీస్ రాని ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 2.15 కోట్ల లాభాలను అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం కూడా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించ బడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: