తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన ....రామాయణం ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆదిపురుష్‌' .ఇక ఈ సినిమాకి  ఓంరౌత్‌  దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇకపోతే ప్రభాస్‌ (Prabhas) రాముడి పాత్రలో నటించిన ఈ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలై.. సినీ ప్రియుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్‌పై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు నటుడు మంచు విష్ణు. అయితే తన తదుపరి చిత్రం 'జిన్నా' ప్రమోషన్స్‌లో భాగంగా

 ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ టీజర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆయన మాట్లాడుతూ ''లైవ్ - యాక్షన్‌ చిత్రంగా రామాయణాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తారని అనుకున్నాం. అంతేకాదు ఇదొక యానిమేటెడ్‌ సినిమా అని ఊహించలేదు. అందుకే టీజర్‌ విడుదలైనప్పుడూ చాలా మంది నిరాశకు గురయ్యారు. అయితే టీజర్‌ విడుదలకు ముందే.. ఇదొక యానిమేటెడ్‌ సినిమా అని చెప్పి ఉంటే ఇంతలా ట్రోల్స్ వచ్చేవి కాదు.  ఇకపోతే ప్రేక్షకుల్ని మోసం చేస్తే ఇలాంటి రియాక్షన్సే వస్తాయి.కాగా  టీజర్‌ చూసి నేనూ మోసపోయా''అయితే ''బాహుబలి తర్వాత ప్రభాస్‌ నుంచి రామాయణం వస్తుందంటే,

 అందులోనూ 'తానాజీ' దర్శకుడు దీన్ని తెరకెక్కిస్తున్నారంటే భారీగా ఊహించుకున్నా. అంతేకాదు ప్రేక్షకులకు కూడా ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక  అలాంటి సమయంలో యానిమేటెడ్‌ వీడియోతో వస్తే ఇలాంటి స్పందనలే వస్తాయి'' అని విష్ణు వివరించారు.ఇదిలావుంటే ఇక మంచు విష్ణు తాజాగా జిన్నా సినిమాలు నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మంచు విష్ణు నటించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు ఇటీవల ఈయన నటించిన ఈ సినిమాకి సంబంధించిన పాటలు టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ను కనబరచడం జరిగింది. దీంతో మంచు ఫాన్స్ మంచి విష్ణు నటించిన ఈ సినిమా కోసం తెగ ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: