తాజాగా చిరు, బాలయ్యల సినిమాలకు ఓవర్సీస్ బిజినెస్ డీల్ పూర్తయింది. రెండు చిత్రాలనూ నిర్మిస్తున్నది మైత్రీ మూవీ మేకర్సే కాగా.. వీటి ఓవర్సీస్ హక్కులను కూడా ఒకే సంస్థకు కట్టబెట్టింది. ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ యుఎస్లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది. చిరు సినిమాను రూ.7 కోట్లకు కొన్న ఫార్స్ ఫిలిమ్స్.. బాలయ్య చిత్రానికి రూ.4 కోట్ల రేటు పెట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ‘వాల్తేరు వీరయ్య’ దాదాపు 2 మిలియన్ డాలర్లు రాబట్టాలి. ‘వీరసింహారెడ్డి’ మిలియన్ డాలర్ల మార్కును అందుకోవాలి.
యుఎస్లో బాలయ్యకు ముందు నుంచి మార్కెట్ కొంచెం తక్కువే. కాబట్టే రేటు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బాలయ్య సినిమా మీద చిరు చిత్రానికి 50 శాతం అయినా ఎక్కువ బిజినెస్సే జరగొచ్చు. ఐతే బిజినెస్ బాగా జరుగుతున్నప్పటికీ చిరు సినిమాలకు రికవరీ మాత్రం కష్టమే అవుతోంది. ‘గాడ్ ఫాదర్’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా అన్ని చోట్లా బయ్యర్లకు కొంత మేర నష్టాలే మిగిల్చింది. ఇదిలా ఉండగా మరో సంక్రాంతి సినిమా ‘వారిసు’ (తెలుగులో వారసుడు) యుఎస్ రైట్స్ను సైతం ఫార్స్ ఫిలిమ్సే సొంతం చేసుకుంది. రేటు రూ.7.5 కోట్ల దాకా పలికినట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి