మహేష్ బాబుకు వరుస షాక్ లు తగులుతున్నాయి.. ఒకే ఏడాది లో ముగ్గురును కొల్పొయారు.పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించే తండ్రిని కోల్పొయిన బాధలో ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం, కొన్ని రోజుల క్రితం తల్లి ఇందిరా దేవి మరణం, జనవరిలో అన్న రమేష్ బాబు మరణం...ఒక్క ఏడాదిలో ముగ్గురు ఆప్తుల్ని ఆయన కోల్పోయారు. ఇంత బాధలో ఉన్న ఆయన... అభిమానులు ఎవరూ ఖాళీ కడుపుతో వెళ్ళకూడదని తీసుకున్న నిర్ణయం ప్రజల మనసులు గెలుచుకుంది..


కృష్ణను ఆఖరి చూపు చూడటానికి తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పద్మాలయ స్టూడియో దారులు అభిమానులతో నిండిపోయాయి. తన తండ్రి ఆఖరి చూపు కోసం వచ్చిన అభిమానులు ఎవరికీ అసౌకర్యం కలగకూడదని తమ సిబ్బందికి మహేష్ బాబు సూచించారని తెలిసింది. అంత విషాదంలో ఉన్నా సరే అభిమానుల కోసం ఆయన భోజనాలు ఏర్పాటు చేయించారు. మహేష్ చేసిన పనిని అభిమానులే కాదు, సామాన్య ప్రేక్షకులు సైతం అభినందిస్తున్నారు..350కు పైగా సినిమాలు చేసి, ప్రేక్షకులను తనదైన నటనతో అలరించిన సూపర్ స్టార్ కృష్ణ ను కడసారి చూసేందుకు చిత్రసీమ ప్రముఖులు, ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా అభిమానులు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో గల పద్మాలయ స్టూడియోకు తరలి వచ్చారు..


కృష్ణంరాజు మరణించిన తర్వాత ఆయన స్వగ్రామమైన మొగల్తూరులో సంస్మరణ సభ నిర్వహించారు. దానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. వాళ్ళకు ప్రభాస్ భోజనాలు పెట్టించారు. దానికి సుమారు నాలుగు కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం..అదే విధంగా మహేష్ బాబు కూడా చెయ్యడం తో ఆయన ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం  చేస్తున్నారు.కృష్ణ మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ప్రముఖులు కొనియాడారు. తెలుగు సినిమాలో ఎన్నో ప్రయోగాలకు ఆయన ఆద్యుడు అని, తెలుగు సినిమా ఉన్నతికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు..అలాంటి వ్యక్తి మళ్ళీ రారు..


మరింత సమాచారం తెలుసుకోండి: