తలపతి విజయ్ ప్రస్తుతం వరిసు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తమిళం లో రూపొందుతున్న ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తూ ఉండగా , టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నిర్మాత అయినటు వంటి దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం రెండు పాటలను విడుదల చేసింది. ఈ రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు లో వారసుడు అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను నార్త్ అమెరికాలో కూడా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాను తమిళ్ , తెలుగు మరియు హిందీ భాషలలో కలిపి 600 కు పైగా లొకేషన్ లలో విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ ని నార్త్ అమెరికాలో జనవరి 11 వ తేదీనే విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: