అలాగే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాలో కూడా లీడ్ రోల్ పోషించారు. ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తోన్న ఏజెంట్ సినిమాలో కూడా కీ రోల్ పోషించారు. మరో వారం రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతలోనే ఆయన ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకుంది.ఇక మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ కూడా పెద్ద పాన్ ఇండియా స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దుల్కర్ గతేడాది 'సీతారామం'సినిమాతో సూపర్హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా మమ్ముట్టి తల్లి మరణంపై తిరువనంతపురం ఎంపీ అయిన శశిథూరూర్ సంతాపం వ్యక్తం చేశారు. ' నేడు ఉదయమే మమ్ముట్టితో మాట్లాడాను.ఆయన తల్లిగారి మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అమ్మలేని లోటు అనేది పూడ్చలేనిది. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకునేలా మమ్ముట్టికి ధైర్యాన్ని అందించాలని దేవుణ్ణి కోరుతున్నాను' అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు శశిథరూర్.
అలాగే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాలో కూడా లీడ్ రోల్ పోషించారు. ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తోన్న ఏజెంట్ సినిమాలో కూడా కీ రోల్ పోషించారు. మరో వారం రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతలోనే ఆయన ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకుంది.ఇక మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ కూడా పెద్ద పాన్ ఇండియా స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దుల్కర్ గతేడాది 'సీతారామం'సినిమాతో సూపర్హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా మమ్ముట్టి తల్లి మరణంపై తిరువనంతపురం ఎంపీ అయిన శశిథూరూర్ సంతాపం వ్యక్తం చేశారు. ' నేడు ఉదయమే మమ్ముట్టితో మాట్లాడాను.ఆయన తల్లిగారి మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అమ్మలేని లోటు అనేది పూడ్చలేనిది. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకునేలా మమ్ముట్టికి ధైర్యాన్ని అందించాలని దేవుణ్ణి కోరుతున్నాను' అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు శశిథరూర్.