తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ దర్శకులలో వెంకి అట్లూరి ఒకరు. ఈ దర్శకుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా రూపొందిన తొలి ప్రేమ మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. 

ఆ తర్వాత ఈ యువ దర్శకుడు అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను , నితిన్ హీరోగా రంగ్ దే సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజాలను సాధించాయి. ఆ తర్వాత ఈ దర్శకుడు తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ధనుష్ తో మూవీ ని తెరకెక్కించాడు. ధనుష్ తో వెంకీ అట్లూరి తెరకెక్కించిన మూవీ తెలుగుvలో సార్ అనే పేరుతో విడుదల కాగా ... తమిళ్ లో వాతి అనే పేరుతో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు.

ఇది ఇలా ఉంటే సార్ మూవీ తో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న వెంకీ అట్లూరి తదుపరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు వెలుబడింది. ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని దుల్కర్ సల్మాన్ తో చేయబోతున్నాడు. ఈ మూవీ ని సూర్య దేవర నాగ వంశీ నిర్మించబోతున్నాడు. తాజాగా వెంకీ అట్లూరి ... దుల్కర్ సల్మాన్ ... సూర్య దేవర నాగ వంశీ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరి కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ షూటింగ్ అక్టోబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాను 2024 సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: