మామూలుగా ఎవరైనా తమకి ఇష్టమైనవి త్యాగం చేయాలి అంటే అంత తొందరగా అసలు ఒప్పుకోరు. నిజానికి త్యాగం అనేది చాలా గొప్పది. నచ్చిన వస్తువులు కానీ, నచ్చిన వ్యక్తిని కానీ లేదా మరేవైనా కానీ వదిలేయాలి అంటే చాలా కష్టం.కానీ కొంతమంది ఇతరుల సంతోషం కోసం తమకు నచ్చినవి త్యాగం చేయడానికి అస్సలు వెనకాడరు. వారి సంతోషం కోసం అన్ని ఇచ్చేయమన్న ఇచ్చేస్తూ ఉంటారు. అయితే అల్లు అర్జున్ కూడా గౌరవంతో తనకి ఇష్టమైనది త్యాగం చేశాడు. ఇంతకు ఆయన త్యాగం చేసింది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొంది ఐకాన్ స్టార్ గా మారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్తున్న అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతే కాకుండా ఎంతో మంది అభిమానులు కూడా సంపాదించుకున్నాడు. తొలిసారిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి అల్లు అర్జున్ బాలనటుడుగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చిరంజీవి నటించిన డాడీ సినిమాలో అతిధి పాత్రలో నటించాడు.

2003లో గంగోత్రి సినిమాతో తొలిసారిగా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో తన తొలి నటనతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. తర్వాత ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు, డి జె దువ్వాడ జగన్నాథం వంటి పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు. ఇక మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపరిచాయి కూడా. అయినా కూడా ధైర్యంతో ముందుకు కొనసాగాడు. ఇక ఏడాది కిందట పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు అల్లు అర్జున్.తెలుగులోనే కాకుండా పలు భాషలలో కూడా ఈ సినిమా విడుదల కావడంతో అక్కడ కూడా మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక అల్లు అర్జున్ పారితోషికం విషయంలో కూడా బాగానే ముందున్నాడు. ఈయన భార్య స్నేహ రెడ్డి అందరికీ పరిచయమే. ఈయనకు ఇద్దరు పిల్లలు ఉండగా తన కూతురిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. చాలా వరకు తన పిల్లలకు సంబంధించిన వీడియోలను, అల్లు అర్జున్ కు సంబంధించిన అప్డేట్లను బాగా పంచుకుంటూ ఉంటుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ కి చికెన్ అంటే చాలా ఇష్టమని గతంలో తెలిసింది. చాలావరకు ముక్క లేనిది ముద్ద దిగదు ఆయనకు. అటువంటిది అతడు ఒక ఆరు నెలల పాటు ఒక సినిమా కోసం తనకు నచ్చిన చికెన్ ని వదిలేసాడు. ఇక ఆ సినిమా ఏదో కాదు దువ్వాడ జగన్నాథం. ఈ సినిమాలో ఆయన బ్రాహ్మణ పాత్రలో చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో పూర్తిస్థాయి బ్రాహ్మణ పాత్రపై ఉన్న గౌరవం కోసం నిజంగానే అల్లు అర్జున్ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు తనకి ఇష్టమైన నాన్ వెజ్ కి దూరంగా ఉన్నాడట. ముఖ్యంగా బ్రాహ్మణులకు గౌరవించేందుకు ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: