96 సినిమాను తెలుగు లో జానుగా రీమేక్ చేశారు. అక్కడ విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఆ మూవీని తెలుగులో శర్వానంద్, సమంత కలిసి నటించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా 96 సినిమా రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
కోలీవుడ్ లోనే కాదు 96 సినిమాకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే 96 రీ రిలీజ్ చేస్తున్నారు కానీ జాను సినిమాను మాత్రం మర్చిపోయారు. జాను సినిమా రీ రిలీజ్ చేయట్లేదు కానీ 96 ని రీ రిలీజ్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
విజయ్ సేతుపతి, త్రిష మళ్లీ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. 96 సినిమాలో వారిద్దరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే కోలీవుడ్ లో విజయ్ సేతుపతి ఎక్కువగా నెగిటివ్ రోల్ లో చేస్తున్నారు. ఓ పక్క త్రిష వరుస క్రేజీ ఆఫర్లతో దూసుకెళ్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం త్రిష మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తుంది. అంతకుముందు ఆచార్యలో త్రిష నటించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఫైనల్ గా విశ్వంభరతో త్రిష తిరిగి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి