![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestyle4795bfed-816b-4a78-b7c8-bce55811f473-415x250.jpg)
రాజమౌళి సినిమా లకు ఆయన తండ్రి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథలను అందిస్తారు. అయితే విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కోసం కథను సిద్ధం చేశారు. ఆ సినిమా నే భజరంగి బాయ్ జాన్. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.పాకిస్థాన్ నుంచి తప్పిపోయి ఇండియాకు వచ్చిన ఓ చిన్నారిని తిరిగి పాకిస్థాన్ పంపించేందుకు ఓ సామాన్యుడు ఎలా కష్టపడ్డాడు. చివరకు ఆ పాపను ఎలా పాకిస్థాన్ కు చేర్చాడు అన్నది ఈ కథాంశం.
ఈ బాలీవుడ్ లో 2015లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భజరంగి భాయ్ జాన్ కు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్ధికి, హర్షాలీ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ 17 జూలై 2015న విడుదలైంది. అయితే ఈ సినిమా ను రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఆంట. అయితే విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రాజమౌళికి చెప్పిన సమయంలో ఆయన బాహుబలి పార్ట్ 2 క్లైమాక్స్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారట. అయితే ఆ క్లైమాక్స్ తెరకెక్కించే సమయం కావడంతో రాజమౌళి ఆ సినిమా చేయడానికి నిరాకరించారట. దాంతో ఆ ను కబీర్ ఖాన్ తెరకెక్కించారట. అలా రాజమౌళి సల్మాన్ కు నో చెప్పారట. రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నారు. త్వరలోనే ఈ షూటింగ్ మొదలు కానుంది. ఈ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.