గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమా గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీ గా వున్నారు. ఈ మూవీ రిలీజ్ గురించి ఇంకా క్లారిటీ అయితే రాలేదు...రీసెంట్ గా ఆర్సీ16 షూటింగ్ కూడా మొదలైంది. ఇక సోమవారం (మార్చి 25) హోలీ సందర్భంగా ఆర్సీ17 కూడా అనౌన్స్ చేసేశారు. సుకుమార్ తో రామ్ చరణ్ మరోసారి చేతులు కలుపుతున్నాడు. ఈ సినిమా గురించి రాజమౌళి తనయుడు కార్తికేయ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.రామ్ చరణ్, సుకుమార్ కాంబో ఆరేళ్ల కిందట రంగస్థలం మూవీతో ఎలాంటి మ్యాజిక్ చేసిందో మనందరికి తెలిసిందే.రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుంది అంటే అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీ గురించి తనకు ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలోనే తెలుసని రాజమౌళి తనయుడు కార్తికేయ చెప్పడం విశేషం.ఆర్సీ17 అనౌన్స్‌మెంట్ వచ్చిన కాసేపటికి అతడు సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్  చేశాడు. ఈ సినిమా గురించి ఎక్కువ లీక్ చేయనంటూనే కార్తికేయ చెప్పిన విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఆ  లో అతడు ఏమన్నాడంటే.."ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ సమయంలో  సుకుమార్ గారితో మూవీ చేయబోతున్నట్లు  చరణ్ మాటల సందర్భంగా చెప్పాడు. అంతేకాదు మూవీలో ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి వివరించాడు. ఐదు నిమిషాల పాటు నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అతడు ఆ విషయం చెప్పినప్పటి నుంచీ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ గురించి ఎదురు చూస్తున్నాను. ఆ మూవీ ఓ బ్లాక్‌బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక అది ఓ ఐకానిక్ సీక్వెన్స్ అవుతుంది. నేను దీని గురించి మరీ ఎక్కువగా లీక్ చేయనులే" అంటూ రామ్ చరణ్ ను కార్తికేయ ట్యాగ్ చేశాడు.ఆర్సీ17 అనౌన్స్‌మెంట్ రాగానే అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు కార్తికేయ తో అవి మరింత రెట్టింపయ్యాయి. రంగస్థలం మూవీ చరణ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడతనితో మరెలాంటి మ్యాజిక్ సుకుమార్ చేస్తాడో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: