తెలుగు బుల్లితెర యాంకర్ నటి అనసూయ సినిమాలలో బిజీగా ఉన్నది.. వరుసగా సినిమాలు చేస్తూ కొత్త కొత్త క్యారెక్టర్లలో అభిమానులను మెప్పిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే అనసూయ తన ఫోటోలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈమె చేసేటువంటి ట్వీట్లు కూడా అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇటీవల అనసూయ ఒక ఇంటర్వ్యూలో పొలిటికల్ గురించి మాట్లాడుతూ రోజా నాగబాబు గారు అడిగిన. పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు పిలిస్తే ఖచ్చితంగా ప్రచారం చేస్తానంటూ చెప్పింది అనసూయ. తాను పార్టీలను చూడనని వ్యక్తులను మాత్రమే చూస్తాను అంటూ చెప్పుకొచ్చారు.

అయితే అనసూయ చేసిన వాక్యాలు వైరల్ గా మారడంతో అనసూయ జనసేన పార్టీకి ప్రచారం చేస్తుందని వార్తలను పవన్ ఫ్యాన్స్ వైరల్ గా చేశారు. దీంతో కొంత మంది అనసూయని రాజకీయాల గురించి మాట్లాడుతు చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.. ఈ సమయంలోనే అనసూయ ఒక షాపింగ్ మాల్ ఈవెంట్లో పాల్గొనగా అక్కడ మీడియా తో మాట్లాడిన అనసూయ జనసేనకు ప్రచారం చేస్తున్నారంటగా అని అడగడంతో మరొకసారి క్లారిటీ ఇచ్చింది..


అనసూయ మాట్లాడుతూ తాను తుమ్మిన దగ్గర ఏం మాట్లాడినా కూడా వివాదం గానే చేస్తున్నారు.. గడిచిన ఇంటర్వ్యూలో తనని పొలిటికల్ గురించి అడిగితే అందుకు తగ్గట్టుగా మాత్రమే సమాధానాలు చెప్పాను అంతేకానీ జనసేన కి నా అంతట నేను ప్రచారం చేస్తానని అసలు ఎక్కడో చెప్పలేదు.. ఎవరైనా అడిగితే సపోర్ట్ చేస్తానని చెప్పాను కానీ తను పార్టీకి ప్రచారం చేస్తానని ఎక్కడా చెప్పలేదని తెలిపింది. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అంటూ అనసూయ మరొక సారి క్లారిటీ ఇచ్చింది. అనసూయ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో విలన్ గా నటిస్తోంది ఇటీవలే ఈమె నటించిన రజాకర్ సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటించింది అనసూయ.

మరింత సమాచారం తెలుసుకోండి: