టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటించాడు. మృణాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... పరుశురామ్మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించగా ... గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈవ్రోజు ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. కాకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు ఎలాంటి సర్టిఫికెట్ లభించింది అనే విషయం మాత్రం బయటకు రాలేదు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది.

మూవీ నీ 2 గంటల 40 నిమిషాల నిడివితో ఈ మూవీ బృందం లాక్ చేసినట్లు సమాచారం. ఇలా భారీ నిడివి తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. నిన్న ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇప్పటి వరకు ఈ సినిమాలోని ప్రచార చిత్రాలు , పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే ఏప్రిల్ 5 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd