టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ ఇమేజ్ కలిగిన దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన భద్ర అనే మూవీ తో కెరీర్ ను ప్రారంభించాడు. ఆఖరుగా స్కంద అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక భద్ర నుండి స్కంద వరకు బోయపాటి అన్ని మాస్ సినిమాలే దర్శకత్వం వహించి అందులో చాలా మూవీ లతో సూపర్ సక్సెస్ లను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ ఇమేజ్ కలిగిన దర్శకుడి గా పేరు సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు కొంత కాలం క్రితమే గీత ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. దానితో చాలా మంది బోయపాటి నెక్స్ట్ మూవీ గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉంటుంది ... అని అందులో అల్లు అర్జున్ హీరో గా నటించే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ సడన్ గా బోయపాటి తన నెక్స్ట్ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ లో కాకుండా 14 రీల్స్ బ్యానర్ లో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ బ్యానర్ లో బోయపాటి శ్రీను ... నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా మూవీ ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే బాలయ్య , బోయపాటి కాంబో లో సింహ , లెజెండ్ , అఖండ అనే మూడు మూవీ లు రూపొంది మూడు సూపర్ హిట్ విజయాలను అందుకున్నాయి. గత కొంత కాలంగా బాలయ్య తో "అఖండ 2" మూవీ ని రూపొందిస్తాను అని బోయపాటి చెబుతూ వస్తున్నాడు. మరి ఈ మూవీ "అఖండ 2" గానే ప్రేక్షకుల ముందుకు రానుందా ..?  లేక టోటల్ గా కొత్త కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: