టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరు అయినటువంటి జగపతి బాబు హీరోగా రూపొందిన పెళ్లయిన కొత్తలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఆ తర్వాత యమదొంగ సినిమాతో మరో విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్థానానికి వెళ్లిపోయింది.

ఆ తర్వాత ఈమె తెలుగు తో పాటు అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా కొన్ని టీవీ షో లకు జడ్జ్ గా కూడా వ్యవహరిస్తూ కాలాన్ని ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందిన మైదాన్ అనే మూవీ లో నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ప్రియమణి మాట్లాడుతూ... షారుక్ ఖాన్ నటన ,  ఆయన వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో నటించే అవకాశం వస్తే ఏదైనా వదులుకొని వెళ్తాను.

ఒక వేళ షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి సినిమా చేద్దాం అని అంటే ఏది వదులుకొని అయినా సరే ఆయన దగ్గరికి వెళతాను ... ఈ విషయాన్ని మీడియానే షారుఖ్ వద్దకు తీసుకువెళ్లాలి అని ఆమె కోరారు. ఇకపోతే షారుక్ హీరోగా రూపొందిన చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీ లో ఈమె ఓ ఐటెం సాంగ్ లో నటించింది. దీనికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక పోయిన సంవత్సరం షారుక్ "జవాన్" మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో కూడా ఈమె ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: