టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ ప్రస్తుతం "భజే భాయు వేగం" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ కార్తికేయ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు ఓ చిన్న గ్లిమ్స్ వీడియోను కూడా విడుదల చేసింది. వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఐశ్వర్య మీనన్ ఈ మూవీ లో కార్తికేయ కి జోడిగా కనిపించనుంది. యు వి కాన్సెప్ట్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తోంది. 

మూవీ విడుదల తేదీని ఈ చిత్ర బృందం వారు మరికొన్ని రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. నిన్న ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ను ప్రకటించారు.  నిన్న ఈ మూవీ వారు ఈ సినిమా యొక్క టీజర్ ను రేపు అనగా ఏప్రిల్ 20 వ తేదీన మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ప్రకటించారు.

తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ ను ఈ రోజు మధ్యాహ్నం  2 గంటల 25 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఆ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి గారు లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి , కార్తికేయ భుజంపై చెయ్యి వేసి ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: