టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ల లో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన అనుష్క ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతున్న ఘాటి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటికే వచ్చేసింది . ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. 

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది . ఇక పోతే ఈ మూవీ లో అనుష్క తో పాటు మరో కీలకమైన పాత్ర కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ లో అద్భుతమైన నటుడిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సత్యం రాజేష్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు అనుష్క తర్వాత ఈ మూవీలో అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్ర అదే అని తెలుస్తోంది . ఇలా సత్యం రాజేష్ , అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఘటి మూవీ లో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉంటే గతం లో అనుష్క కీలక పాత్రలో నటించిన వేదం సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ మంచి విజయం అందుకుంది . ఇక ఇందులో వేశ్య పాత్రలో నటించిన అనుష్క తన నటనతో , అందాల తో ప్రేక్షకులను కట్టిపడేసింది . ఇది ఇలా ఉంటే వేదం సినిమా లోనే  సత్యం రాజేష్ కూడా అల్లు అర్జున్ స్నేహితుడు పాత్ర లో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇలా వేదం సినిమాలో నటించిన ఈ ఇద్దరు ఘాటి మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: