నాగ చైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఇందులో ప్రియ భవాని శంకర్ , నాగ చైతన్య కు భార్య పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ తోనే నాగ చైతన్య డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే విక్రమ్ కే కుమార్ కూడా ఈ వెబ్ సిరీస్ తోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా వీరిద్దరి కెరియర్ లో మొట్ట మొదటి డిజిటల్ కంటెంట్ గా విడుదల అయిన దూత ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకొని మంచి విజయం సాధించింది.

ఇక ఇందులోని నటనకు గాను నాగ చైతన్య కు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయిన దూత సిరీస్ అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకోవడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సీరీస్ కి కంటిన్యూగా "దూత 2" ను కూడా రూపొందించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం విక్రమ్ "దూత 2" కి సంబంధించిన స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా తాజాగా ఈ సిరీస్ లో ఓ నటిని కీలక పాత్రలో విక్రమ్ సెలెక్ట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... ఈ  మధ్యకాలంలో తన అద్భుతమైన నటనతో అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న యువ నటీమణులలో ఒకరు అయినటువంటి కామాక్షి భాస్కర్ల ను విక్రమ్ "దూత పార్ట్ 2" లో ఓ కీలకమైన పాత్రలో ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త కనుక నిజం అయితే ఈమెకు మరో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కినట్లే అవుతుంది. ఇకపోతే కామాక్షి భాస్కర్ల ఇప్పటికే మా ఊరి పొలిమేర 1 , మా ఊరి పొలిమేర 2 మూవీ లతో అద్భుతమైన నటిగా గుర్తింపును సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kb