సీరియల్ నటుడు చందు ఆత్మహత్య కేసులో తాజాగా వాట్సాప్ చాట్ కీలకంగా కాబోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సహజీవనం చేస్తున్న పవిత్ర జయరాం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో నటుడు చందు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. పవిత్ర లేని జీవితం ఊహించుకోలేనట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాకపోతే ఈ కేసులో సూసైడ్ కు ముందు ఆయన ఎవరితో చాట్ చేశారో తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. చందు స్నేహితులు చాటింగ్ వివరాల్ని తాజాగా పోలీసులకు అందజేశారు. పరిస్థితి ఇలా ఉంటే నటుడు చందు భార్య తాజాగా చందుకు సంబంధించిన వివరాలను తెలియజేసింది. ఇక ఈ వివరాలను ఒకసారి చూస్తే...

చందు శిల్ప ను స్కూల్ డేస్ వయసు నుండి ప్రేమించమంటూ 3 ఏళ్లు వెంటపడ్డాడు. శిల్పా ఒప్పుకున్న తర్వాత 12 ఏళ్లు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించుకొని వివాహం 2015లో చేసుకున్నారు. త్రినయని సీరియల్లో పవిత్ర పరిచయం తర్వాత శిల్పాకి ప్రత్యక్ష నరకం చూపించాడు. కొన్ని నెలలపాటు శిల్పాను రాత్రంతా కొట్టి టార్చర్ పెట్టేవాడు. విడాకులు ఇచ్చేయమని వేధించేవాడు. ఇద్దరు పసి బిడ్డలను ఉంచుకొని కూడా, 20 ఏళ్ల పై వయసున్న పవిత్ర పిల్లలని తన పిల్లలు అని వాళ్ళ కాలేజీల్లో తండ్రి స్థానంలో సంతకాలు చేశాడు గాని తండ్రిగా సొంత బిడ్డల ప్రోగ్రెస్ కార్డులో ఏ రోజు సంతకం చేయలేదు. పిల్లల మొహం కూడా చూడలేదు. చందు, శిల్పకు ఇద్దరు పిల్లలు, పెద్ద పాప మూడవ తరగతి చిన్నబాబు ఎల్కేజీ.

ఎటువంటి పని పాటు లేకుండా తిరుగుతున్న చందు ని భార్య శిల్ప సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టించి ఒక దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. చందు సీరియల్ లో ఎంట్రీ తర్వాత వారి జీవితం మలుపు తిరిగింది. పవిత్ర చందు సంబంధం పట్ల టీవీలో నటించే వారందరికీ తెలుసు. పవిత్రకి అప్పటికే చాలామందితో సంబంధాలు ఉన్నాయి, ఆని చాలామంది చందుకు వార్నింగ్ ఇచ్చినా ఎవరి మాట చందు వినలేదు. పవిత్ర అంత్యక్రియలను చేసింది పవిత్ర అసలు భర్త. ఇవాళ పవిత్ర ఇంట్లోనే చందు సూసైడ్ చేసుకున్నాడు. చందు గురువారం రాత్రి కూడా సూసైడ్ ప్రయత్నం చేశాడు. శుక్రవారం మధ్యాహ్న నుండి ఎవరి ఫోను చందు తీయలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో పవిత్ర నివసిస్తున్న ఫ్లాట్ తలుపులు బద్దలు పట్టుకొని వెళ్లి చూడగా చందు సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: